ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ రుణమాఫి చేసింది: కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి

0
153 Views

వికారాబాద్: ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ రైతులకు రుణమాఫీ చేసిందని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్థ సుధాకర్ రెడ్డి అన్నారు గురువారం వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గత ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తానని విడుదల వారీగా వేసిన డబ్బులు వడ్డీలకే సరిపోలేవని కానీ కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్న అన్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని కాంగ్రెస్ రైతుల వైపు ఉందని దానికి నిదర్శనం 2 లక్షల రుణమాఫీ అని స్పష్టం చేశారు. ఇప్పుడు బిఆర్ఎస్ నాయకులు నిందలు మోపే చర్యలకు పూనుకుంటున్నారని ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథం సత్యనారాయణ, మహిపాల్ రెడ్డి , కిషన్ నాయక్, మురలి, బొండాల శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, చందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు