ముగిసిన శ్రీమత్ భగవద్గీత పారాయణ

0
38 Views

వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలోని శ్రీ వైభవ లక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రీమత్ భగవద్గీత పారాయణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
వికారాబాద్ గీత వాహిని అధ్యక్షురాలు శ్రీదేవి సదానంద రెడ్డి ఆధ్వర్యంలో ఆషాడ మాసం శ్రీమత్ భగవద్గీత పారాయణంలో భాగంగా గురువారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని వైభవలక్ష్మి దేవాలయంలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో గీత వాహిని బృందం, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.