వికారాబాద్ లో మహిళా ఆత్మహత్య

0
87 Views

వికారాబాద్: అనారోగ్యంతో బాధపడుతూ మనస్థాపం చెంది ఓ మహిళా ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి సిఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం. మర్పల్లి మండలం సిరిపురం గ్రామానికి చెందిన వీణ(35)ను గత 11 సంవత్సరాల క్రితం వికారాబాద్ మండలం ద్యాచారం గ్రామానికి చెందిన పట్లోళ్ల శివకుమార్ కు ఇచ్చి వివాహం జరిపించారు. వారికి ఒక కూతురు ఉంది. గత కొంతకాలంగా వీణ అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. ఎప్పటి మాదిరిగానే గురువారం రాత్రి భార్యాభర్తలు కలిసి భోజనం చేసి పండుకున్న తర్వాత వీణ పక్క గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం లేచి చూసిన శివకుమార్ కు భార్య పక్కన కనిపించకపోవడంతో ఇంట్లో గాలించగా రూమ్ లో ఉరివేసుకొని ఉన్న విషయాన్ని గమనించి వీణ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వీణ తల్లి సుగుణమ్మ అక్కడికి చేరుకొని జరిగిన విషయాన్ని శివకుమార్ను అడిగి తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు తన కూతురు చావుపై ఎలాంటి అనుమానం లేవని తాను అనారోగ్యంతో బాధపడుతుందని పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.