గంజాయితో వికారాబాద్ లో పట్టుపడ్డ టీవీ ఛానల్ లో కొరియోగ్రాఫర్

0
1,112 Views

వికారాబాద్: సభ్య సమాజం తలదించుకునే రీతిలో యువత గంజాయి డ్రగ్స్ వైపు పణంగా పెడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం మరోవైపు ఎక్సైజ్ శాఖ ఇతర సంస్థలు డ్రగ్స్ తో పాటు గంజాయిని నిర్మూలించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న దాడుల్లో భాగంగా వికారాబాద్ లో గంజాయితో పట్టుబడిన యువకుడు ఉదంతా మీది. వివరాల్లోకి వెళితే.. ఒక టీవీ ఛానల్ లో కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న కేతావత్ వినోద్ నాయక్ (అలెక్స్ క్రూ) అనే యువకుడు గంజాయి విషయాన్ని పసిగట్టిన ఎక్సైజ్ పోలీసులు పట్టుకొని తనిఖీలు నిర్వహించగా అతని వద్ద 62 గ్రాముల గంజాయి లభ్యమైంది. ఈ ఘటన వికారాబాద్ ఉడిపి  హోటల్ సమీపంలో  జరిగింది. ఎక్సైజ్ డిటిఎఫ్ సీఐ కే శ్రీనివాస్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రాఘవేణాలతో పాటు సిబ్బంది ఉన్నారు. సిబ్బందిని ఎక్సైజ్ అండ్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కమల సన్ రెడ్డి, రంగారెడ్డి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్,అసిస్టెంట్ కమిషనర్ కిషన్, ఎక్సైజ్ సూపర్ ఇండెంట్ విజయ భాస్కర్ గౌడ్ అభినందించారు