75 Views
వికారాబాద్: వైదం అందక మృతి చెందిన మేకను పశువైద్యశాల బోర్డుకు వేలాడదీసిన సంఘటనలో మండల పరిధిలోని నాగారం పశుశైద్యశాల వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ (వీఎల్వో) సురేందర్ నాయక్ సస్పెండ్ అయ్యారు. నాగారంలో గత నెల 31న రైతు దశరథం మేకను వైద్యం కోసం పశువైద్యశాలకుతీసుకు రాగా పశువైద్యశాలలో సిబ్బంది లేక వైద్యం అందక మేక మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన రైతు మేక కళేబరాన్ని పశువైద్య శాల బోర్డుకు వేలాడదీసి, నిరసన తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పశు సంవర్ధక శాఖ ఉన్నతాధికారులు ఈ సంఘటనపై విచారణ జరిపించారు. వీఎల్ వో సురేందర్ నాయక్ ను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.