వికారాబాద్: తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ, హౌసింగ్, మరియు సమాచార & ప్రజా సంబంధాల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రేపు (సోమవారం) వికారాబాద్ జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముందుగా వికారాబాద్ పట్టణంలో 4 సూటెడ్ R&B గెస్ట్ హౌస్ నిర్మాణ శిలాఫలకా శంకుస్థాపన, ఆలంపల్లి నుంచి రాళ్ల చిటెంపల్లి వరకు డబుల్ రోడ్ నిర్మాణం ప్రారంభం మర్పల్లీ నుండి కోట్పల్లి రోడ్డు నిర్మాణం శంకుస్థాపన వికారాబాద్ నుండి తాండూర్ వరకు రోడ్డు నిర్మాణం శంకుస్థాపన పనులకు శ్రీకారం చూడుతారు. అనంతరం తాండూరులో అమ్రుత్ 2.0 నీటి సరఫరా పథకం ప్రారంభం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణ పనుల పర్యవేక్షణ తరువాత జింగుర్తి గ్రామంలో జింగుర్తి సబ్-స్టేషన్ ప్రారంభం, చంద్రవంచ – 33/11 KV సబ్-స్టేషన్ శంకుస్థాపన చేయనున్నారు. మంత్రితో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
రేపు వికారాబాద్ కు మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి
278 Views