సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో పురుగుల అన్నం వివాదం: విద్యార్థుల ఆందోళన

0
147 Views

నారాయణపేట: కొడంగల్ నియోజకవర్గంలోని నాచారం కస్తూర్బా గాంధీ పాఠశాలలో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. “పురుగుల అన్నం పెడుతున్నారు, అధికారులకు కంప్లైట్ చేసినా పట్టించుకోవడం లేద”ని విద్యార్థులు ఆరోపించారు.

ఈ సమస్యపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. “కలెక్టర్ వచ్చి తమకు హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించమని” వారు స్పష్టంగా ప్రకటించారు. విద్యార్థుల ఆందోళనతో పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది.

ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ, అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.