ఫాం హౌజ్ లో స్విమ్మింగ్ పూల్ లో అనుమానస్పద మృతి

0
293 Views

మేడ్చల్: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని యాదగిరి పల్లిలో ఓ ఫాం హౌజ్ లో సందీప్ రెడ్డి అనే యువకుడు అనుమానస్పదంగా మృతి చెందారు. నిన్న సాయంత్రం ఆరుగురు స్నేహితులతో కలిసి ఫాం హౌజ్ కి వచ్చిన సందీప్ రెడ్డి, రాత్రి మద్యం సేవించిన తరువాత తెల్లవారు జామున స్విమ్మింగ్ పూల్ లో చనిపోయారు.

స్విమ్మింగ్ పూల్ లో పడిపోయిన సందీప్ రెడ్డిని వెంటనే చిర్యల్ గ్రామంలోని విజయ్ హాస్పటిల్ కి తరలించారు. అయితే అప్పటికే సందీప్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఫాం హౌజ్ కి వచ్చిన స్నేహితులు బిస్ కేట్ కంపెనీలో పని చేసే వారుగా గుర్తించారు. మొత్తం 12 మంది అక్కడ ఉన్నారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, సందీప్ రెడ్డి ఎలా చనిపోయాడో వివరాలు సేకరిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. మృతుడి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.