కాంగ్రెస్ ఫోర్త్ సిటీ ఏర్పాటు వెనక భూదందా : ఎంపీ బండి సంజయ్ తీవ్ర విమర్శలు

0
149 Views

అనంతగిరి డెస్క్ : బీజేపీ నాయకుడు బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఫోర్త్ సిటీ ఏర్పాటు వెనక భూదందా ఉన్నదని, వేల ఎకరాలు సేకరించి దోచుకునే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి మరియు భూముల అన్యాక్రాంతంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ధరణి కమిటీ ఏం తేల్చిందో ప్రజలకు తెలియజేయాలని, కేసీఆర్ కుటుంబ భూ దోపిడీపై తీసుకున్న చర్యలు ఏవీ తెలియజేయాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ బాటలోనే నడుస్తుందని, బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు కూడా పడుతుందని బండి సంజయ్ హెచ్చరించారు.