రూ. 60 కోట్ల ఆర్అండ్ బీ పనులకు శంకుస్థాపనలు చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

0
306 Views

వికారాబాద్ నియోజకవర్గంలో ఆర్‌ అండ్ బీ పరిధిలోని అభివృద్ధి పనులకు, మొత్తం 60 కోట్లతో శంకుస్థాపనలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శ్రీకారం చుట్టారు. కోట్లతో 4 సూటెడ్ అతిథి గృహం, ఆలంపల్లి నుంచి రాళ్ల చిట్టంపల్లి వరకు 12 కోట్లతో రోడ్డు పనులు,
కోట్ పల్లి, బంట్వారం, మర్పల్లి మండలాల్లో 42 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ, “ఈ పనులు పూర్తి అయిన తర్వాత ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. రోడ్డు పనులు పూర్తయిన తర్వాత రవాణా సౌకర్యాలు బాగా మెరుగుపడతాయి. అతిథి గృహం నిర్మాణం పూర్తి అయిన తర్వాత, ఈ ప్రాంతానికి వచ్చిన అతిథులకు మంచి వసతులు కల్పించబడతాయి” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డి, మునిసిపల్ చైర్ పర్సన్ మంజూల రమేష్, స్థానిక నాయకులు విశ్వనాథం సత్యనారాయణ, కొండల్ రెడ్డి, కిషన్ నాయక్ , రత్నారెడ్డి, రాంచందర్ రెడ్డి నాయకులు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.