న్యాయవాదులపై దాడికి నిరసనగా వికారాబాద్ మూడో రోజు న్యాయవాదుల నిరసన. ఆర్డీవో కార్యాలయం ముందు దీక్ష

0
291 Views

వికారాబాద్: జనగాం జిల్లాలోని న్యాయవాదులు అమృతరావు, కవిత దంపతులపై పోలీసులు దాడిని వికారాబాద్ జిల్లా న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ, ఈ చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. శుక్రవారం రోజు నిరసన కార్యక్రమంలో భాగంగా కోర్టు నుంచి ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయం ముందు దీక్ష చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో న్యాయవాదులు గోవర్ధన్ రెడ్డి, మాదవరెడ్డి, సంపూర్ణ ఆనంద్, బస్వలింగం పటేల్, చౌదరి యాదవరెడ్డి, కమాల్ రెడ్డి, రఫి, కిరణ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.