న్యాయవాదుల నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్

0
235 Views

వికారాబాద్:జనగామ జిల్లాలో న్యాయవాద దంపతులైన  అమృతరావు, కవితలపై పోలీసుల దాడికి నిరసనగా అలాగే న్యాయవాదుల రక్షణ చట్టం కొరకై 3వ రోజు వికారాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్డిఓ ఆఫీస్ ఎదురుగా నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ దీక్ష కార్యక్రమానికి వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్  సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దీక్ష చేస్తున్న న్యాయవాదులకు పూలమాలలు వేసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయాన్ని కాపాడే న్యాయవాదులకు రక్షణ చట్టం అనేది చాలా అవసరం అన్నారు. అలాంటి చట్టం తీసుకురావడానికి మద్దతు తెలుపుతూ.. తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్  దృష్టికి తీసుకెళ్లి న్యాయవాదుల ప్రత్యేక రక్షణ చట్టం అమలు అయ్యేలా చూడాలని కోరుతాం అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.