మర్పల్లి మండలంలో కొత్త స్వచ్ఛ్ ట్రక్కు ప్రారంభం

0
116 Views

వికారాబాద్ (మర్పల్లి ) : చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో  ఆగస్టు 14న  వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల టాయిలెట్ల శుభ్రత కోసం స్వచ్ఛ్ ట్రక్కు ప్రారంభం చేయనుండగా  ఈ కార్యక్రమానికి తెలంగాణ అసెంబ్లీ శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్  ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రస్తుతం చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 240 పాఠశాలల్లో విద్యార్థుల కోసం 8 స్వచ్ఛ్ ట్రక్కులు ప్రతిరోజూ టాయిలెట్లు శుభ్రం చేస్తున్నాయి. రేపటి నుండి మర్పల్లి మండలంలో తొమ్మిదవ స్వచ్ఛ్ ట్రక్కు అందుబాటులోకి రానుంది. జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నారు.