జూనియర్ డాక్టర్ హత్యకు కారకులైన నిందితులను శిక్షించాలి

0
75 Views

వికారాబాద్ : బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో జూనియర్ డాక్టర్ హత్యకు కారకులైన నిందితులను వెంటనే శిక్షించాలని ఐఎంఏ ప్రతినిధులు డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇలాంటి దుశ్చర్యాలకు పాల్పడుతున్న వ్యక్తులను వెంటనే శిక్షించాలని హత్యకు గురైన జూనియర్ డాక్టర్ కుటుంబాన్ని ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటన పునారావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని డాక్టర్లకు జూనియర్ డాక్టర్లకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రతినిధులు సాధుసత్యనాథ్, డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ రమ్య, డాక్టర్ భరత్, పలువురు డాక్టర్లు జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు