వికారాబాద్ పట్టణంలో బీజేవైఎం ఆద్వర్యంలో బైక్ ర్యాలీ……

0
330 Views

వికారాబాద్:హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేవైఎం నాయకులు తిరంగా యాత్ర ను వికారాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. పట్టణంలోని ఆలంపల్లి నుండి వికారాబాద్ లోని ప్రధాన చౌరస్తాల గుండా బైక్ ర్యాలీని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి పాల్గొని ర్యాలీలో పాల్గొనగా బీజేపీ నాయకులు, బీజేవైెం శ్రేణులు పెద్ద ఎత్తున జాతీయ జెండాలను చేత పట్టుకుని భారత్ మాతకి జై నినాదాలు చేశారు.. ఈ కార్యక్రమంలో నాయకులు శివరాజ్, శ్రీధర్ రెడ్డి, నరోత్తం రెడ్డి, పోకల సతీష్, వివేకానంద రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, అమర్, హెచ్ వై ఎస్ సాయి , బీజేవైఎం నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.