నా తమ్ముళ్ళ మీద ఏడుపు ఎందుకు?: CM రేవంత్ రెడ్డి

0
410 Views

అనంతగిరి డెస్క్ ఢిల్లీ: నా తమ్ముళ్ళ మీద అంత ఏడుపు ఎందుకు? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన, నా తమ్ముళ్ళకి నా ప్రభుత్వంలో ఎలాంటి పదవులు ఇవ్వలేదని. ఎవరు నా ప్రభుత్వ ప్రోటోకాల్ వాడుకోవడం లేదని స్పష్టం చేశారు.రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి తన సొంత డబ్బులతో విదేశాలకు వెళ్తే, దానిని కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని ఒక పెద్ద సమస్యగా చూపించడం సరికాదని పేర్కొన్నారు. కొండల్ రెడ్డి తన సొంత ఖర్చులతోనే అన్ని వ్యవహారాలు నిర్వహిస్తున్నార ని ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు.రాజకీయ ప్రత్యర్థులు ఆగ్రహంతో తప్పుడు ఆరోపణలు చేస్తూ, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమే కానీ, అవి వాస్తవాలను వక్రీకరించకుండా ఉండాలని ఆయన హితవు పలికారు.