రుణమాఫి కాని వారు దరఖాస్తు చేసుకోవాలి: జిల్లా వ్యవసాయాధికారి గోపాల్

0
652 Views

వికారాబాద్ : రుణమాఫీ కానీ రైతులు మండలాల్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల కేంద్రాన్ని సంప్రదించాల్సిందిగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ తెలిపారు. ఇప్పటివరకు రెండు లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ వర్తించడం జరిగిందని, వివిధ కారణాలవల్ల అర్హులైన లబ్ధిదారులు రుణమాఫీ కానీ ఎడల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ఫిర్యాదుల కేంద్రాన్ని సంప్రదించి తమ సమస్యను తెలుసుకోవాల్సిందిగా తెలిపారు. ఏవేనీ సాంకేతిక కారణాల వల్ల తప్పులు దొరినట్లయితే సరి చూసుకోవాల్సిందిగా ఆయన తెలిపారు.