ఎల్ఆర్ఎస్ ధరఖాస్తుల పరిశీలించేందుకు టీం మెంబర్ల ఏర్పాటు:జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

0
97 Views

వికారాబాద్: పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్, దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు టీం మెంబర్ లను ఏర్పాటు చేయడం జరిగిందని,ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల వెరిఫికేషన్ పై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి అవగాహనా కల్పిస్తునట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.మంగళవారం కాన్ఫరెన్సు హాలు నందు మున్సిపల్ కమిషనర్లు , ఆర్ ఐ లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల వెరిఫికేషన్ టీం మెంబర్లు యాప్ ద్వారా ఏవిదంగా వెరిఫికేషన్ చేయాలనే విదానాన్ని పిపిటి ద్వార అవగాహనా కల్పించారు. వెరిఫికేషన్ మెంబర్లు రేపటి నుండి ఎల్ ఆర్ ఎస్ దరకాస్తుల వెరిఫికేషన్ ప్రారంభించాలని ఆదేశించారు. వెరిఫై చేసిన రిపోర్ట్ ను యాప్ లో అప్లోడ్ చేయాలనీ ఆదేశించారు. అనతరైజేడ్ గా చేసిన లే అవుట్స్ లోని ప్లాట్లలో రేగులరైసేషన్ చేసేందుకు మున్సిపాలిటి, రెవెన్యూ , ఇర్రిగేషన శాఖల సమన్వయంతో పని చేయాలన్నారు.సమావేశంలో అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) సుదీర్,లింగ్యా నాయక్ , మున్సిపల్ కమీషనర్లు జాకీర్ అహమ్మద్, విక్రం సింహ రెడ్డి, బలరాం నాయక్, మాధవి, ఆర్ ఐ లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.