కల్లీ కల్లు కాటు…. పీరంపల్లిలో వ్యక్తి మృతి…. మరి కొందరి అస్వస్థత

0
198 Views

వికారాబాద్: కల్లీకల్లు భారిన పడి ఓ వ్యక్తి మృతి చెందరగా మరి కొంత మంది అస్వస్థతకు గురైన ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న సంఘటన  వికారాబాద్ జిల్లాలో కలకలం రేపింది.వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన దుర్గయ్య కల్లీ కల్లు తాగి మంగళవారం రాత్రి మృతి చెందారు. గ్రామం నుంచి మంగళవారం 8 మంది వికారాబాద్ పట్టణంలోని మిషన్ ఆసుపత్రి మెడిక్యూర్, ఈశ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుండగా తాజాగా మరి కొంత మంది మెడిక్యూర్ ఆసుపత్రిలో చేరి చికిత్స  పొందుతున్నారు. వారికి యూరియన్ రావడం లేదని, పరిస్థతి కొందరికి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ విషయంలో ఉన్నతాధికారులు, పాలకులు వెంటనే చర్యలుతీసుకుని వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని గ్రామస్తులుకోరుతున్నారు.