కల్తి కల్లు సేవించి 8 మంది అస్వస్థత..వికారాబాద్ ఆసుపత్రుల్లో చికిత్స

0
768 Views

వికారాబాద్  : కల్తీ కల్లు తాగి ఎనిమిది మంది అస్వస్థతకు గురైన సంఘటన వికారాబాద్ మండల పరిధిలో చోటు చేసుకుంది . ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి . వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి, అంజమ్మ, ప్రశాంత్ , నాగమణి, సంతోష,లక్ష్మమ్మలతో పాటు మరికొందరూ సోమవారం రాత్రి గ్రామంలో విక్రయించే కల్లు కొనుగోలు చేసి సేవించారు. అయితే మంగళవారం వారు అస్వస్థకు గురికాగా వారిని వికారాబాద్ మిషన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరో ఇద్దరిలో ఒకరిని హైదరాబాద్ కు రిఫర్ చేయగా వికారాబాద్ ఈశ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతుండగా మెడిక్యూర్ ఆసుపత్రిలో మరోకరు చికిత్స పొందుతున్నారు . అయితే కల్లు కలిపిన నీరు కలుషితం కావడం వల్లే కల్లు తాగిన వారు అస్వస్థకు గురైనట్లు గ్రామస్తులు తెలిపారు .