428 Views
వికారాబాద్:వికారాబాద్ జిల్లాలో రాష్ట శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ బ్యాంకు ఖాతా నెంబర్ కు రైతు రుణమాఫీ పథకం క్రింద 1,50,863 రూపాయలు పొరపాటున జమ చేయబడినవని జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.డి సి సి బి బ్యాంకు, తాండూర్, వారి టెక్నికల్ సమస్య వలన ఈ అమౌంట్ గడ్డం ప్రసాద్ కుమార్ బ్యాంకు ఖాతాలోకి జమ అయిందని, ఈ విషయంపై స్పీకర్ ప్రసాద్ కుమార్ స్పందిస్తూ తన బ్యాంకు అకౌంట్ కు పొరపాటున వచ్చిన రూపాయలను తిరిగి అదే బ్యాంక్ ద్వారా ప్రభుత్వానికి వాపసు చేస్తునట్లు ఒక ప్రకటనలో తెలిపారు.