రుణమాఫీ కాని రైతులు దిగులు చెందొద్దు:కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల సురేష్ యాదవ్

0
101 Views

వికారాబాద్ (మర్పల్లి):రుణమాఫీ కాని రైతులు దిగులు చెందొద్దని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల సురేష్ యాదవ్/ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాములు యాదవ్ బుధవారం మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల సురేష్ యాదవ్/ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాములు యాదవ్. గార్లు మాట్లాడుతూ..సాంకేతిక లోపం వల్ల రుణమాఫీ జరగని రైతులకు త్వరలోనే మాఫీ జరుగుతదని హామీ ఇచ్చారు.2 లక్షల పైన ఉన్నా వారందరికి కూడా మాఫీ జరుగుతుంది అని తెలిపారు. ఇప్పటి వరకు మూడు విడుతల్లో రుణమాఫీ కాని రైతుల నుంచి మా అధికారులు వివరాలను సేకరిస్తున్నారన్నారు . వివిధ కారణాల చేత రైతులకు రుణమాఫీ కాలేదని రేషన్ కార్డు లేక కుటుంబ నిర్ధారణ కాకపోవడం వల్ల చాలా మందికి రుణమాఫీ కాలేదన్నారు. పట్టాదారు పాసుపుస్తకంతో పాటు ఆధార్ కార్డులో వివరాలు తప్పులు ఉండడం వల్లే రుణమాఫీ లో జాప్యం జరిగిఉండొచ్చు అన్నారు. అలాగే మండలంలోని ప్రతి గ్రామంలో రుణమాఫీకి అర్హులు అయ్యిఉండి మాఫీ కానీ వారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యుల నిర్ధారణ చేయాలని మండలం వ్యవసాయా అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమం లో రాచాన్నా,ఉప్పారి నగేష్, మహేష్, మాణిక్ ప్రభు, శేఖర్ స్వామి,తదితరులు పాల్గొనడం జరిగింది.