ఎమ్మెల్యే కాలే యాదయ్య కారుపై కోడిగుడ్ల తో కాంగ్రెస్ నాయకుల దాడి అడ్డుకున్న పోలీసులు

0
267 Views

అనంతగిరిడెస్క్:రంగారెడ్డి జిల్లా షాబాద్ లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పై కాంగ్రెస్ కార్యకర్తలు కోడి గుడ్లతో దాడి చేశారు. ఈ ఘటన షాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో కల్యాణ లక్ష్మీ చెక్కులను లబ్దిదారులకు అందజేయడానికి వచ్చినప్పుడు చోటుచేసుకుంది.కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బీమ్ భరత్ వర్గానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. కాంగ్రెస్ నాయకులు కాలే యాదయ్యపై దాడి చేయడానికి కారణం ఆయన పార్టీ మారడమేనని పేర్కొన్నారు. గత పది సంవత్సరాలుగా షాబాద్ ప్రాంతానికి అభివృద్ధి చేయలేదని, బీఆర్‌ఎస్‌లో ఉండి ఆస్తులు సంపాదించారని, ఆ ఆస్తులను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరారనే వారు ఆరోపించారు.ఎమ్మెల్యే అనుచరులకు నామినేట్ పోస్టులు ఇవ్వడం కూడా ఈ వివాదానికి కారణమని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.