పద్మాశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఆంజనేయులు

0
170 Views

వికారాబాద్: పద్మాశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా వనంపల్లి ఆంజనేయులు ఎంపికయ్యారు. ఆదివారం వికారాబాద్ సత్యభారతి గార్డెన్ లో నిర్వహించిన పద్మాశాలి సంఘం జిల్లా ఎన్నికల్లో ఆంజనేయులు 184 ఓట్లు రాగా ప్రత్యర్ధి వర్కల మల్లేశంకు 89 ఓట్లు పొలయ్యాయి. ఆంజనేయులు మల్లేశంపై 95 ఓట్ల ఆధిఖ్యంతో విజయం సాధించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు ఆంజనేయులను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయగా ఓ పోలింగ్ లో పద్మాశాలి సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.