హైడ్రా ను వికారాబాద్ జిల్లా కు విస్తరించాలి:బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జి. నాగేందర్ గౌడ్

0
70 Views

వికారాబాద్ : హైడ్రా ను వికారాబాద్ జిల్లా కు విస్తరించాలని బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జి. నాగేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో మీడియా తో మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలోని శివసాగర్ చెరువు శిఖంలో వెలసిన అక్రమంగా వెంచర్లు, ఫామ్ హౌస్ తదితర నిర్మాణాలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. పరిగి లోని 28 ఎకరాలలో విస్తరించి ఉన్న కొత్త చెరువు నేడు 4 ఎకరాలకే పరిమితమైందన్నారు. ముఖ్యమంత్రి, స్పీకర్ ఇద్దరు ఈ జిల్లా కు చెందిన వారు ఉన్నందుకు ఇక్కడ కూడా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు. హైడ్రా తొలగించిన చాలా వాటిల్లో పేద ప్రజలు ఉన్నారని, వారికి బిఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు. త్వరలో జరిగే స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ అత్యధిక స్థానాలలో గెలుపొందుతుందని చెప్పారు. పార్టీ గ్రామ స్థాయిలో బలంగా ఉందన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు.