మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్

0
77 Views

వికారాబాద్:మట్టి గణపతులను పూజిస్తూ పర్యావరణాన్ని కాపాడుదాం అని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ పిలుపునిచ్చారు. రేపు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మట్టి వినాయకులను పూజిస్తే పర్యావరణానికి హితమని మంచి ఉద్దేశంతో.. మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని న్యూ గంజ్ హనుమాన్ మందిర్ దగ్గర మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, మున్సిపల్ సిబ్బంది రామకృష్ణ, మహిపాల్ ఆర్పి పద్మ, స్థానికులు పాల్గొన్నారు.