ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

0
68 Views

వికారాబాద్: మండలంలో ఉత్తమ ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమం శుక్రవారం అంబేద్కర్ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్, జడ్పీ సీఈఓ సుధీర్ హాజరయ్యారు. కార్యక్రమంలో ఎమ్మార్వో లక్ష్మీనారాయణ, ఎంపీడీవో వినయ్ కుమార్, ఎంఈఓ బాబు సింగ్, ఎంఎన్ఓ నరసింహులు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు రామకృష్ణారెడ్డి , హెడ్మాస్టర్ రాజశేఖర్ పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు.మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా కే బసప్ప జైలుపల్లి, ఆర్ లక్ష్మమ్మ వెంకటాపూర్ తండా, షాజియా జహీర్ ఆలంపల్లి, ఎస్ లక్ష్మణ్ లక్ష్మీ దుర్గ సిద్దలూరు, ఎండి అలీముద్దీన్ గొట్టిముక్కుల, బి సరిత గరీబ్ నగర్, బి ప్రమీల రామయ్య గూడా, జి తులసి బురాన్ పల్లి, జి నర్సమ్మ గరీబ్ నగర్, కె రేఖ, వి రాజారావు, కులమతి భాస్కరరావు కొట్టాలగూడెం తండా, ఎం కిరణ్ కుమార్ కోటాలగూడం, దాలయ్య ద్యాచారం, సంతోష్ కుమార్ జగపతి, డి సుధీర్, ఏ అనూష శివారెడ్డి పేట్, కే జ్యోత్స్నదేవి పులుసు మామిడి ఉపాధ్యాయులుగా సన్మానించబడ్డారు. అదేవిధంగా
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన నాగరాణి ఫుల్ మద్ది ని సన్మానించారు.కార్యక్రమంలో పిఆర్టియు టీఎస్, తపస్ యూనియన్, టీఎస్ యుటిఎఫ్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు