స్థానిక సంస్థల్లో మెరుగైన ఫలితాలు వస్తేనే ఎమ్మెల్యే టిక్కెట్లు : టీపీసీసీ ఛీప్ మహేష్ గౌడ్

0
101 Views

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ ప్రదేశ్ కమిటీ (టీపీసీసీ) చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ వరంగల్‌ జిల్లా నేతలతో జరిగిన సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించని వారిని అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు.నాయకత్వంలో ఐక్యత అవసరమని, కొత్త, పాత నేతలు కలిసి పనిచేయాలని మహేష్ గౌడ్‌ పేర్కొన్నారు. “పదవులు పొందిన నాయకులు ఓ మెట్టు దిగి ప్రవర్తించాలని, పార్టీకి నిబద్ధతతో ఉండాలి” అని ఆయన సూచించారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడం అత్యంత ముఖ్యమని గుర్తు చేశారు.ఈ సమీక్షలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై స్థానిక స్థాయిలో పార్టీని మరింత బలపర్చేందుకు కార్యాచరణపై చర్చించారు