సీఎం సహాయ నిధికి రూ. 50 లక్షలు , సీఎంకు అందించిన నటుడు మహేష్ బాబు

0
100 Views

హైదరాబాద్: వరద బాధితుల సహాయార్థం అగ్ర నటుడు మహేశ్ బాబు ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళం అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీ హిల్స్ నివాసంలో కలిసిన మహేశ్ బాబు ఈ మేరకు విరాళం చెక్కు అందజేశారు. ఏషియన్ మహేష్ బాబు సినిమాస్ (AMB) తరపున కూడా మరో 10 లక్షల రూపాయలు విరాళం అందజేశారు. మహేశ్ వెంట సతీమణి నమ్రత కూడా ఉన్నారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్న వారిని ముఖ్యమంత్రి అభినందించారు.