అధికార పార్టికి కొమ్ముకాస్తున్న ఎస్ఐపై చర్యలు తీసుకోవాలి:మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

0
526 Views

వికారాబాద్:అధికార పార్టికి కొమ్ముకాస్తున్న ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని  వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మంగళవారం వికారాబాద్ జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేసారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మర్పల్లి మండలంలో ఎస్ఐ సురేష్ కక్షపూరితంగా గత మూడు నెలలుగా బీఆర్ఎస్ కార్యకర్తల పైన పలు గ్రామాలలో అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేస్తున్న ఘటనపై  మంగళవారం అక్కడికి వెళ్లి సిఐతో మాట్లాడుతున్న సందర్భంలో కాంగ్రెస్ నాయకులు అలజడి సృష్టించి గుండాయిజం బెదిరింపులు చేస్తూ అక్కడ చేసిన అరాచకాన్ని అంత జరుగుతున్న పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాసి ప్రేక్షక పాత్ర వహించడాన్ని అన్ని విషయాల పైన విచారణ చేసి ఎస్ఐ పైన చర్యలు తీసుకొని మర్పల్లిలో జరిగిన ఘటన మీద విచారణ చేయాలని  జిల్లా ఎస్పీ కి కలసి వినతిపత్రం అందజేసారు.