స్పీకర్ ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు:టీ.పీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల రఘువీర్ రెడ్డి

0
137 Views

వికారాబాద్:స్పీకర్ ప్రసాద్ కుమార్  పై బిఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నానని టీ.పిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల రఘువీర్ రెడ్డి అన్నారు. దిగజారి విమర్శలు చేస్తే ప్రజలు హర్షించరని మన హోదా స్థాయి తెలుసుకొని మాట్లాడాలని ఆయన హితువు పలికారు. స్పీకర్ స్థాయిలో ఉన్నప్పటికీ ప్రసాద్ కుమార్  నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలను తీసుకురావడానికి కృషి చేస్తున్న వారిపై ఈ స్థాయిలో విమర్శలు చేయడం తగదని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు లేవని ప్రాంత అభివృద్ధికి ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని ఆయన సూచించారు.