అటవీ శాఖలోని పనులను సమీక్షించిన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కంపా సి సువర్ణ

0
41 Views

వికారాబాద్:అనంతగిరి లోని ఎకొ టూరిజం అభివృద్ధి పనులను చూసి నగర వన యోజన కింద మరిన్ని అభివృద్ధి పనులను చేయాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కంపా సి సువర్ణ పేర్కొన్నారు.  శనివారం  వికారాబాద్ జిల్లాలో జరుగుతున్న అటవీ శాఖలోని పనులను సమీక్షించారు. ఈ సందర్బంగా పరిగి రేంజ్ లోని జాఫర్ పల్లి అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ ను సందర్శించి అందులో చేయవలసిన పనులను గురించి సూచనలు ఇచ్చారు. అనంతగిరి లోని ఎకొ టూరిజం అభివృద్ధి పనులను చూసి నగర వన యోజన కింద మరిన్ని అభివృద్ధి పనులను చేయాలని సూచించారు. కోటపల్లి రిజర్వాయర్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ జ్ఞానేశ్వర్, శ్యాం కుమార్, రేంజ్ ఆఫీసర్ రాజేందర్, ప్రతిమ రేంజ్ ఆఫీసర్లు శ్రీమతి అరుణ సెక్షన్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.