రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలి:డిసిసిబి డైరెక్టర్ కిషన్ నాయక్

0
82 Views

వికారాబాద్ : రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని డిసిసిబి డైరెక్టర్ ఎన్. కిషన్ నాయక్ తెలిపారు. సోమవారం శివారెడ్డి పేట పిఎసిఎస్ సర్వసభ్య సమావేశం అధ్యక్షుడు ముత్యం రెడ్ది అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ, అధిక దిగుబదులనిచ్చే ఆధునిక వంగడాలతో సాగు చేసి అధిక దిగుబడులు పొందాలని రైతులను కోరారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఖాళీగా ఉన్న మూడు ఎస్సి, ఒక ఎస్టి డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఖాళీగా నాలుగు డైరెక్టర్ పోస్టులను భర్తీ చేసిందన్నారు. తాను పిఎసిఎస్ చైర్మన్ గా పని చేశానని, రైతులకు సేవ చేయడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటానని అన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జె. రత్నారెడ్డి, డైరెక్టర్లు జె. వెంకట్ రెడ్ది, జనార్థన్ రెడ్ది, నర్సిములు, శ్రీనివాస్ రెడ్ది, సిఇఒ ప్రభులింగం తదితరులు పాల్గొన్నారు.