21 ఏళ్ల తరువాత కలుసుకున్న పూర్వవిద్యార్థులు

0
391 Views

వికారాబాద్(మర్పల్లి): మర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు 21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైన శనివారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఒకరినొకరు యోగక్షేమాలను అడిగి తెలుసుకొని నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. 21 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు, నాతోటి ఉపాధ్యాయులు ఒకేవేధిక మీద కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను మర్చిపోకుండా జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. ఈ ఒకే వేదిక మీద కలిసేలా చొరవ చూపిన పూర్వ విద్యార్థులకు ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు మల్లయ్య, కృష్ణారెడ్డి, ఆనందం, భాస్కర్, రాజ ప్రసన్న, సుజాత, భవానీలలతో పాటు పూర్వ విద్యార్థులు ఎన్ వెంకట్ రామ్, టి రాఘవేందర్, యు మహేష్, మన్నెపల్లి బస్వరాజ్, నర్సింలు, జక్కు సునీల్, ప్రవీణ్ గౌడ్, గఫార్,కార్తిక్, సుభాష్ రెడ్డి, పోచయ్య,లాయక్ పాషా నయుమ్, జ్యోత్స్న, సంధ్య, లత, స్వాతి, శివ లీల, సంగీత, పుష్పాలత, సంతోషి తదితరులు పాల్గొన్నారు.