అట్టహాసంగా జహిరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం….చైర్మన్ గా ఎ.సాయిచరణ్

0
25 Views

జహిరాబాద్: జహిరాబాద్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం సోమవారం అట్టహాసంగా జరిగింది. చైర్మన్ గా ఎ సాయి చరణ్ (బిటెక్) భాద్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ చంద్రశేఖర్  విచ్చేశారు. వ్యవసాయ పాలక మండలి సభ్యులచే వ్యవసాయ శాఖ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతనంగా భాద్యతలు స్వీకరించిన చైర్మన్  మాట్లాడుతూ రైతులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తాం అని అన్నారు. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి రైతుకు చెరవేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి సర్వదా కృషి చేస్తాం అన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు భారీ గజమాలతో చైర్మన్ ను సన్మానించారు, కార్యక్రమానికి హాజరైన నాయకులు సాయి చరణ్ కి శాలువా పూల దండలు కప్పి సన్మానించారు.వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా తిరుపతి రెడ్డి డైరెక్టర్లుగా నరేష్ గౌడ్, కిషన్ రాథోడ్, వంశీ రాజ్, సుజాత, జాఫర్, శేఖర్, అశోక్, అఖిల్ హహ్మద్,అమ్జాద్ మియా, మల్లారెడ్డి, నర్సింహులు,శంకరప్ప పాటిల్, తదితరులు భాద్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు, జెడ్పీటీసీ లు, యంపిపి లు యంపిటిసి లు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.