మంచినీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి:వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల

0
20 Views

వికారాబాద్ : వేసవికాలం ప్రారంభమైన సందర్భంగా వికారాబాద్ మున్సిపల్ పరిధిలో ఎక్కడ కూడా మంచినీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులు, సిబ్బందిని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల ఆదేశించారు. మంగళవారం మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ. పైప్ లైన్ లీకేజీలు ఎక్కడ ఉన్నా వాటికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి సమస్యను పరిష్కరించాలని సూచించారు. మున్సిపల్ పరిధిలోని 34 వార్డులలో ఎక్కడ ఎలాంటి నీటి సమస్య ఉన్న, స్థానిక కౌన్సిలర్ అలాగే అధికారుల దృష్టికి తీసుకెళ్తే అట్టి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని పట్టణ ప్రజలకు చైర్ పర్సన్ హామీ ఇచ్చారు. గత 3 రోజులుగా వికారాబాద్ పట్టణంలో మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.