శివారెడ్డిపేట్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ నాయకులు

0

వికారాబాద్:దేశంలో కఠిన నిర్ణయాలు తీసుకొని కాశ్మీర్ మనకు సొంతం చేయడంతో పాటు ముస్లింలకు అవసరమైన త్రిపుల్ తలాక్ ను రద్దు చేయడం జరిగిందని బిజెపి పట్టణ అధ్యక్షుడు నరోత్తం రెడ్డి నాయకులు రాజేందర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డిలు పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని శివ రెడ్డి పేట కొత్రెపల్లి గ్రామాల్లో బిజెపి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా మోడీ వైపు చూస్తున్నారని దేశ భవిష్యత్తు బిజెపి చేతుల్లోనే ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారని వారు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి పార్టీకి ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ నాయకులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు