పరిగి సమస్యల పరిష్కారం కొండాకే సాధ్యం : కొండా సంగీతారెడ్డి

0

పరిగి:పరిగి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే సత్తా చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మాత్రమే ఉందన్నారు ఆయన సతీమణి కొండా సంగీతారెడ్డి. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఆదివారం పరిగి నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్, గడి సింగాపూర్ గ్రామాలతో పాటూ పరిగి టౌన్ లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా సంగీతారెడ్డి మాట్లాడుతూ పరిగి నియోజకవర్గంలో ప్రజలు సరైన రోడ్లు, సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా గ్రామాల్లో అర్హులకు పెన్షన్లు, పక్కా గృహాలు అందాల్సి ఉందని ఆమె చెప్పారు. వారందరి సమస్యలను కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా పరిష్కరిస్తారని ఆమె హామీ ఇచ్చారు.
బీజేపీలోకి భారీగా చేరికలు
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంగా భారతీయ జనతా పార్టీలోకి భారీగా చేరికలు నమోదవుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరుతున్నారు. ఆదివారం పరిగి నియోజకవర్గంలో కొండా సంగీతారెడ్డి పర్యటిస్తున్న తరుణంలో వందలాదిమంది యువకులు, మహిళలు తరలివచ్చి భారతీయ జనతా పార్టీలో చేశారు. వారికి ఆమె కాషాయ కండువాలు కప్పి బీజేపీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండా సంగీతారెడ్డి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా నరేంద్రమోదీకి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పరిగి నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.