హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ

0

వికారాబాద్(ధారూరు):హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే  సబితా ఇంద్రారెడ్డి అన్నారు.గురువారం ధారూర్ మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ధరూర్ మండల BRS పార్టీ నాయకులు మరియు కార్యకర్తల సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో18 ఏళ్లు నిండిన మహిళలకు అందరికి రూ. 2500/- మరియు విద్యార్థులకి స్కూటీ లు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామని, రూ.15 వేలతో ఆర్థిక భరోసా కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయంకుండా రైతులని మోసం చేస్తుందన్నారు.కల్యాణ లక్ష్మి/షాదీముబారక్ కి అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం దాని ఊసే ఎత్తటం లేదన్నారు.హామీలు నెరవేర్చటం లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రోజు కరెంటు కష్టాలతో ప్రజలని, రైతులని ఇబ్బందులకి గురించేస్తుందన్నారు.ఎన్నికల్లో ఓటు అడిగేందుకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను హామీ గ్యారంటీల అమలు ఏమైందని నిలదీయాలన్నారు.ప్రజలని మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పటానికి వచ్చే ఎన్నికల్లో ప్రజల పక్షాన ఉండే BRS పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారిని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ నియోజకవర్గం ఇంచార్జి కార్తీక్ రెడ్డి, సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, ధారూర్ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, PACS చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, AMC మాజీ చైర్మన్ సంతోష్ కుమార్, AMC మాజీ చైర్మన్ రాములు, వైస్ చైర్మన్ అంజయ్య నాయకులు వెంకటయ్య, రాజు గుప్తా, కావాలి అంజయ్య, రవీందర్ రెడ్డి, బాలు నాయక్ రహమతుళ్ళ ఖాన్, విజయ్ కుమార్ యూత్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి, ST సెల్ దేవేందర్, SC సెల్ నర్సిములు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.