జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబలించే కుట్ర:సీఎం రేవంత్ రెడ్డి

0
83 Views

హైదరాబాద్: జమిలి ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జమిలి ఎన్నికల ముసుగులో కొందరు దేశాన్ని కబళించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “జమిలి ఎన్నికల పేరిట ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో సీతారాం ఏచూరి లేకపోవడం బాధాకరం. దేశం కోసం పోరాడిన ఏచూరి చూపిన మార్గంలోనే మేము ఈ ఎన్నికలను అడ్డుకుంటాము, పోరాడతాము,” అని ఆయన స్పష్టం చేశారు.సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా జమిలి ఎన్నికలపై విస్తృతంగా చర్చించాలని, ప్రజాస్వామ్యంపై పెనుముప్పుగా ఉండే ఈ చర్యలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.