దళిత బందువిడుదల చేయాలి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

0
281 Views

వికారాబాద్:  దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట దళిత బంధు సాధన సమితి సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గత ప్రభుత్వం దళితుల కోసం దళిత బంధు ఏర్పాటు చేసి దళితుల అభివృద్ధికి పాటుపడిందని అలాగే ఈ ప్రభుత్వం కూడా దళితుల అభివృద్ధి సాధనకు కృషి చేయాలన్నారు. దళితుల బంధువులకు దసరా లోపు విడుదల చేసి దళితులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెంటన్న మాదిగ, రామన్న, శ్రీనివాస్, వెంకటయ్య, అశోక్, శ్రీను కుమార్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు