ప్రతి ఒక్కరు హిందూ ధర్మం కోసం పోరాడాలి : గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్

0
18 Views

తాండూరు(యాలాల్ ) : ప్రతి ఒక్కరు హిందూ ధర్మం కోసం పోరాడాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా యాలాల మండలం అగ్గనూర్ గ్రామంలో, పరిగి నియోజకవర్గం కంకల్ గ్రామంలో  ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభ వేదిక పై ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ….ప్రతి ఒక్కరు హిందూ ధర్మాన్ని పాటించాలని హిందూ ధర్మం కోసంపోరాడాలని అన్నారు. దేశంలోని అన్ని మసీదులను ఆలయాలుగా మారుస్తామని అన్నారు. అయోధ్య రామ మందిరం తరహాలోనే త్వరలో కోర్టు ఆదేశాలతో మధుర, కాశీ లో కూడా ఆలయాలను కట్టి తీరుతామని అన్నారు. అదేవిధంగా దేశంలో 40,000 ఆలయాలను పునర్నిర్మాణం చేస్తామని అది మా లక్ష్యం అని అన్నారు. ఈ లక్ష్యం నెరవేరితే మా బామ్మర్ది అసదుద్దీన్ ఓవైసీ తట్టుకోలేడని ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. అంతకుముందు సభ వేదిక పై శివాజీ జీవిత చరిత్ర గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ నాయకులు పాల్గొన్నారు.