కేసీఆర్ కు గవర్నర్ పదవి కేటీఆర్ కు మంత్రి పదవి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

0
78 Views

అనంతగిరి డెస్క్ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల బీఆర్‌ఎస్ (భారత రాష్ట్ర సమితి) పార్టీకి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రణాళికలు జరుగుతున్నాయని,  ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గవర్నర్‌గా నియమించవచ్చని పేర్కొన్నారు. అలాగే, కేటీఆర్‌కు కేంద్రమంత్రి పదవి, హరీష్ రావుకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అవకాశముందని, కవితకు లిక్కర్ స్కాం కేసులో బెయిల్ లభిస్తుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీశాయి. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌-బీజేపీ సంబంధాలపై మరిన్ని అనుమానాలను రేకెత్తించాయి, అయితే బీఆర్‌ఎస్‌ నేతలు ఈ వార్తలను ఖండిస్తున్నారు .