హుక్కా సంబంధిత పదార్థాలు పట్టుకున్నట్ల టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి ఎస్ ఐ ఎం ప్రశాంత్ వర్ధన్

0
17 Views

వికారాబాద్:వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి  ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించగా హుక్కా సంబంధిత పదార్థాలు పట్టుకున్నట్ల టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి ఎస్ ఐ, ఎం ప్రశాంత్ వర్ధన్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పక్కా సమాచారం మేరకు వికారాబాద్  పపట్టణంలోని ప్రభుత్వ దవాఖాన పక్కన గల ఎస్ జె పాన్ విల్లా లో పోలీసులు తనిఖీలు చేశారు. అందులో హుక్కాతో పాటు రూ.8950 విలువైన హుక్కా సంబంధిత పదార్థాలు పట్టుకొని సీజ్ చేసినట్లు వివరించారు. వాటిని స్థానిక ఠాణాలో అప్పగించినట్లు వెల్లడించారు.జిల్లాలో డ్రగ్స్, మత్తుపదార్థాలు, ఇతర నిషేధిత పదార్థాలపై ఉక్కు పాదం మోపుతున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు.