ఈనెల 15న జాబ్ మేళా:జిల్లా ఉపాధి కల్పనాధికారి షేక్ అబ్దుల్ సుభాన్

0
12 Views

వికారాబాద్:ఈనెల 15న ఉదయం 10:30 గంటలకు వికారాబాద్ పట్టణంలో నిరుద్యోగ యువతకు ఫార్మసీ రంగంలో ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి షేక్ అబ్దుల్ సుభాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.వికారాబాద్ జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం వద్ద అపోలో ఫార్మసీ ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో సుమారు 150 ఫార్మసీ ఉద్యోగాల కొరకు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని, అర్హులైన అభ్యర్థులను కంపెనీ నిర్వాహకులు జాబ్ మేళా ద్వారా ఎంపిక చేసుకుంటారని తెలిపారు. ఫార్మసిస్టులు, ఫార్మసి అసిస్టెంట్లు, అసిస్టెంట్లు, ట్రైనీల పోస్టులకు కనీస విద్యార్హతలు బి – ఫార్మసీ, యం – ఫార్మసీ లతో పాటు ఎస్ ఎస్ సి, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు గల యువతి యువకులు ఈనెల15 ( గురువారం) నిర్వహించు జాబ్ మేళాకు యువత అధిక సంఖ్యలో పాల్గొని తగిన ఉపాధి అవకాశాలు పొందాలని ఆయన కోరారు.ఇతర వివరములకు జాబ్ మేళా నిర్వాహకుడు శ్రీ. మియా సాబ్ 9676047444 నకు సంప్రదించవచ్చని తెలిపారు.