అర్హులందరికీ రుణమాఫి:జిల్లా వ్యవసాయాధికారి మోహన్ రెడ్డి

0
259 Views

వికారాబాద్: జిల్లాలో అర్హులన రైతులందరికీ రుణమాఫి అవుతుందని జిల్లా వ్యవసాయాధికారి మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం వికారాబాద్ మండలంలోని పీరంపల్లి గ్రామంలో మండల వ్యవసాయ అధికారులు చేపడుతున్న రుణమాఫీ కాని (రేషన్కార్డు లేని) కుటుంబసభ్యుల నిర్ధారణకై కొనసాగుతున్న ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆన్ లైన్ నమోదు చేస్తున్న వివరాలను, ప్రక్రియను ఏఓ జ్యోతితో ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన రైతులందరికి రుణమాఫీ వర్తిస్తుందని ఎవరు ఆందోళన చెందవద్దని తెలిపారు. రుణమాఫీ విషయంలో ఎలాంటి సందేహలున్న గ్రామాలకు వచ్చే వ్యవసాయాధికారులకు కలిసి తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి రుక్మిణి, ఏఈఓ కావ్యగ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.