రైతులందరికీ వెంటనే రుణమాఫీ చేసి రైతు భరోసా వెంటనే విడుదల చేయాలి: మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

0
134 Views

వికారాబాద్:రైతులందరికీ వెంటనే రుణమాఫీ చేసి రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రుణమాఫీ జరగలేదని ఫిర్యాదు చేయడానికి వారం క్రితం హైదరాబాద్ ప్రజా భవన్ కు వచ్చిన రైతులను పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో గురువారం నారెగూడెం గ్రామానికి వచ్చి ఆ రైతులను పరామర్శించారు. పోలీసులు అరెస్ట్ చేసిన రైతులను కేటీఆర్ తో ఫోన్ మాట్లాడించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి మాట్లాడుతూ. గ్యారెంటీల అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. మాజీ మంత్రితో పాటు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.