మొక్కలు నాటే కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్

0
65 Views

వికారాబాద్:గతంలో ఎన్టీఆర్ చౌరస్తా నుండి ఎన్నెపల్లి చౌరస్తా వరకు రోడ్డు డివైడర్లో పెట్టిన కొనో కార్పస్ మొక్కలను ప్రజారోగ్యం దృష్ట్యా తొలగించామని… వాటిస్థానంలో ఫాక్స్ టైల్, డ్రాకేనా మొక్కలను నాటడం జరుగుతుందని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని శనివారం చైర్ పర్సన్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జాకీర్ అహ్మద్, శానిటేషన్ ఇంచార్జ్ ఎస్ఐ యేసు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.