186 Views
వికారాబాద్: మునిసిపల్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 3న నిర్వహించడం జరుగుతుందని మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరు కానున్నారని, కౌన్సిల్ సభ్యులు, అధికారులు అందరూ సకాలంలో సమావేశానికి హాజరు కావాలని సూచించారు.
నిధుల కోసం ఎదురు చూపు
ప్రత్యేక నిధుల కోసం వికారాబాద్ మునిసిపాలిటీ కొత్త పాలకవర్గం ఏర్పడి నాటి నుంచి ఎదురు చూస్తున్న ఫలితం లేకుండా పోయింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం కౌన్సిల్ సమావేశానికి స్పీకర్ హాజరవుతున్న తరుణంలో వికారాబాద్ మునిసిపాలిటీకి ప్రత్యేక నిధులు ఏమైనా వస్తాయా అని పాలకవర్గం ఎదురు చూస్తుంది.