పెండింగ్ ఉన్న అభివృద్ది పనులను వేగవంతంగా పూర్తి చేయాలి:జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి

0
19 Views

వికారాబాద్:జిల్లా లో ఇప్పటికే మంజురై వివిధ దశల్లో పెండింగ్ ఉన్న అభివృద్ది పనులను వేగవంతంగా పూర్తి చేయాలనీ సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు.శనివారం ఉదయం టెలి కాన్ఫరెన్సు ద్వారా ప్రతి గ్రామ పంచాయతి బిల్డింగ్స్, స్కూల్స్ కాంపౌండ్ వాల్స్, కిచెన్ షేడ్స్ నిర్మాణ పనులు ఏవైతే ముందే ప్రారంభించి పూర్తి కాని పనులను సత్వరమే పూర్తి చేసి ఎఫ్ టి ఓ జనరేట్ చేయాలనీ అధికారులకు ఆదేశించారు. సి సి రోడ్ల నిర్మాణ పనులను ప్రతి రోజు టార్గెట్ పెట్టుకొని నాణ్యత తో పూర్తి చేసి పురోగతి లోకి తీసుకురావాలని ఆదేశించారు. జిల్లా లో మంజూరు అయిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి ఎఫ్ టి ఓ జనరేట్ చేసి పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. జిల్లాలోసి సి రోడ్లకు మంజూరైన నిదులతో అంచనాలను రూపొందించుకొంటూ సి సి రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయలని అధికారులకు ఆదేశించారు. సంబంధిత కాంట్రాక్టరల తో మాట్లాడి లేబర్ ను సమీకరించి పనులు పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్బంగా మండలా ల వారిగా సి సి రోడ్ల నిర్మాణ పనుల పురోగతికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. టెలి కాన్ఫరెన్సు లో పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లు డి ఇ లు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.